News June 3, 2024
లిక్కర్ స్కామ్లో 32వ నిందితురాలిగా కవిత: ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6వ సప్లిమెంటరీ ఛార్జిషీట్ను ED దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల్లో MLC కవితను 32వ నిందితురాలిగా చేర్చింది. కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోరింది. ఆమె 9 ఫోన్లను ధ్వంసం చేశారని, AAPకు ₹100 కోట్లు చెల్లించేలా సౌత్ గ్రూప్తో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఇలా మొత్తం ₹292.8cr విలువైన క్రైమ్ కార్యకలాపాల్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యారని పేర్కొంది.
Similar News
News January 26, 2026
HAM రోడ్ల పనులకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ!

TG: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(HAM)లో అభివృద్ధి చేయడానికి గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ఉంటుందని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో వారికి అడ్వాన్స్ కింద 10%, వర్క్ ముగియగానే 30% బిల్లులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. మిగతా 60% పదిహేనేళ్లలో చెల్లించేలా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. తద్వారా పనులు స్పీడప్ అవుతాయని భావిస్తోంది.
News January 26, 2026
ఎక్కువ వెల గొడ్డును, తక్కువ వెల గుడ్డను కొనరాదు

ఎక్కువ ధర పెట్టి పశువును కొన్నప్పుడు, అది అనుకోకుండా మరణిస్తే యజమానికి భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే మరీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని బట్టలు కొంటే అవి చిరిగిపోయి, రంగు వెలిసి, ముడుచుకుపోతాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో ముడిపడి ఉన్న ప్రమాదం, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి. అనవసర ఆడంబరానికి పోయి ఎక్కువ వెల పెట్టకూడదు, అతి తక్కువ ధరకు ఆశపడి నాణ్యత లేని వస్తువును తీసుకోకూడదు.
News January 26, 2026
నేడు వీటిని దానం చేస్తే..

ఈరోజు దానధర్మాలు చేస్తే అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. నేడు బియ్యం, పప్పులు, కూరగాయలు దానం చేయాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శ్రేష్ఠం. ఆవులకు పశుగ్రాసం తినిపించి, వైష్ణవాలయాలను సందర్శించాలి. ఇలా భక్తితో దానాలు చేసి ఉపవాసం ఉంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, గ్రహ దోషాలు నశించి వంశాభివృద్ధి, మనశ్శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ చిన్న సాయం జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది.


