News June 4, 2024
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్లు 49,176

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు మొత్తం 49,176 గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు నమోదైన జిల్లాగా సిక్కోలు పేరు నమోదు చేసుకుంది. మరో అరగంటలో ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 1996 మంది శ్రమించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.
Similar News
News December 25, 2025
మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

ఈనెల 26న మీ చేతికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22ఏ జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
News December 25, 2025
మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు: రామ్మోహన్ నాయుడు

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమని పంచడమే కిస్మస్ సందేశమని అన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
News December 25, 2025
సిక్కోలు సిన్నోడు SUPER

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే గగనం.. అలాంటిది శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, మజ్జిలిపేట గ్రామానికి చెందిన పైడి.సతీష్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. UPSC లో గ్రూప్-B నర్సింగ్ ఆఫీసర్, AMIIS లో నర్సింగ్ ఆఫీసర్, తెలంగాణలో MHSRB, 51 ర్యాంకుతో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను సంపాదించాడు. సతీష్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.


