News June 4, 2024

అవినాశ్ రెడ్డికి 2,274 ఓట్ల ఆధిక్యం

image

AP: కడప పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ(SC) అభ్యర్థి వరప్రసాద్ రావు లీడింగులో ఉన్నారు.

Similar News

News October 9, 2024

ఇవాళ ఈ శ్లోకాన్ని పఠించండి!

image

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజు మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. చదువులతల్లి జన్మనక్షత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయంటారు. ఇవాళ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణినీ, నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ’ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించండి.

News October 9, 2024

కులగణనకు సిద్ధమైన ప్రభుత్వం!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది. నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం రేవంత్ సర్కారు రూ.150 కోట్లు కేటాయించగా గైడ్ లైన్స్ ఖరారు కావాల్సి ఉంది. 30 రోజుల్లో 90వేల మంది సిబ్బందితో ఈ గణన పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు ఫైనల్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది.

News October 9, 2024

కోహ్లీ రికార్డుకు దగ్గర్లో సూర్య

image

బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా ఈరోజు రెండో టీ20 ఆడనుంది. ఈమ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును సమం చేయవచ్చు. అత్యంత తక్కువ T20 మ్యాచుల్లో 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచారు. విరాట్ 73 మ్యాచుల్లో 2500 పరుగుల మార్క్‌ను దాటారు. SKY 72 మ్యాచుల్లో 2461 రన్స్ చేశారు. పాక్ బ్యాటర్ బాబర్ 67 మ్యాచుల్లోనే 2500రన్స్ చేసి ప్రథమ స్థానంలో ఉన్నారు.