News June 4, 2024
BIG BREAKING: ఖాతా తెరవని కారు
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల్లో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఆధిక్యత కనబర్చడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మలుచుకోగా ఇందులో గులాబీ పార్టీ విఫలమైందని స్పష్టమవుతోంది.
Similar News
News October 9, 2024
హిందూ మెజార్టీ స్థానాల్లో బీజేపీ అనూహ్య ఓటమి
జమ్మూ కశ్మీర్లోని జమ్మూలో తమకు పట్టున్న రెండు స్థానాల్లో BJP ఓటమి పాలైంది. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న బానీ, రాంబన్ నియోజకవర్గాల్లో ఓటమి చవి చూసింది. బానీ స్థానంలో BJP అభ్యర్థి జెవాన్లాల్పై ఇండిపెండెంట్ అభ్యర్థి రామేశ్వర్ సింగ్ ఏకంగా 18,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంబన్లో NC అభ్యర్థి అర్జున్ సింగ్ 8,869 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో ఈ రెండు స్థానాల్లో BJP నెగ్గింది.
News October 9, 2024
ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ఎంపీలతో చంద్రబాబు
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఏపీని కూడా రైల్వే శాఖ భాగం చేసిందని కూటమి ఎంపీలకు CM చంద్రబాబు తెలిపారు. తొలి దశలో దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు మీదుగా మైసూరు, ముంబై నుంచి HYD వరకు ట్రైన్లను ప్రతిపాదించారు. తాజాగా బెంగళూరు, చెన్నై, HYD, అమరావతి నగరాలను కలిపేలా ప్రతిపాదనలు తయారవుతున్నాయని బాబు వెల్లడించారు. నివేదిక సిద్ధం అయ్యాక రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందన్నారు.
News October 9, 2024
బ్యాటరీ పర్సంటేజ్తో ఈసీకి కాంగ్రెస్ అభ్యర్థుల ఫిర్యాదు
హరియాణాలోని మహేంద్రగఢ్, పానిపట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీల పర్సంటేజ్తో ఈసీకి ఫిర్యాదు చేశారు. EVMలలో 99% బ్యాటరీ ఉన్నచోట BJP, 60-70% ఉన్నచోట కాంగ్రెస్ లీడ్లో ఉందని, కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ‘EVMలలో ఆల్కలీన్ బ్యాటరీలు వాడుతున్నాం. ఇది వోల్టేజీని బట్టి పర్సంటేజ్ తక్కువగా చూపిస్తుంది. ఫలితాలకు బ్యాటరీకి సంబంధం లేదు’ అని పేర్కొంది.