News June 4, 2024

MP: 17 స్థానాల్లో బీజేపీ దూకుడు.. శివరాజ్, సింధియా ముందంజ

image

మధ్య‌ప్రదేశ్‌లో వార్ వన్‌సైడ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో బీజేపీ 17 స్థానాల్లో అదరగొడుతోంది. విపక్ష ఇండియా కూటమి రెండిట్లో ఆధిక్యంలో ఉంది. గుణలో జ్యోతిరాధిత్య సింధియా, విదిశాలో శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. చింద్వాడాలో నకుల్ కమల్‌నాథ్ (కాంగ్రెస్), బాలాఘాట్‌లో అశోక్ సింగ్ (కాంగ్రెస్) పోటీనిస్తున్నారు.

Similar News

News October 9, 2024

ప్రకాశం: రైతు బజార్ కేంద్రాల్లో టమాటాలు విక్రయాలు

image

ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్‌ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.

News October 9, 2024

వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి

image

TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

News October 9, 2024

నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు

image

తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.