News June 4, 2024
ఆ రాష్ట్రాలపై బీజేపీ భారీ ఆశలు
ఈ ఎన్నికల్లో గెలిచి మోదీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని రాష్ట్రాల ఫలితాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ సీట్లను సాధించి కేంద్రంలో తన విజయావకాశాలను సునాయాసం చేసుకోవాలన్న లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. అందుకే ఈ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ వరుస పర్యటనలతో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించారు.
Similar News
News October 8, 2024
డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!
మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్స్టర్ ఓం ప్రకాశ్ నిర్వహించిన డీజే పార్టీలో పలువురు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. పిశాచి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి ప్రయాగ మార్టిన్, మంజుమ్మల్ బాయ్స్ నటుడు శ్రీనాథ్ భాసి పార్టీలో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
News October 8, 2024
GATE-2025 గడువు పొడిగింపు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News October 8, 2024
అవినీతి జగన్పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్
AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.