News June 4, 2024
ఈసారి అత్యధిక మెజారిటీ ఎవరికి?
లోక్సభ ఎన్నికల్లో ఈసారి భారీ మెజారిటీ ఎవరికి దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో గుజరాత్లోని నవ్సారీ నుంచి బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీతో, 2014లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 ఉపఎన్నికలో కడప నుంచి వైఎస్ జగన్ 5.45 లక్షల మెజారిటీతో గెలిచారు. మరి ఈ ఎన్నికల్లోభారీ మెజారిటీ ఎవరిదో!
Similar News
News October 8, 2024
GATE-2025 గడువు పొడిగింపు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News October 8, 2024
అవినీతి జగన్పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్
AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
News October 8, 2024
ఒమర్ అబ్దుల్లానే సీఎం: ఫరూక్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి సీఎం అని ప్రకటించారు.