News June 4, 2024

ఈసారి అత్య‌ధిక మెజారిటీ ఎవ‌రికి?

image

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈసారి భారీ మెజారిటీ ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న దానిపై ఆసక్తి నెల‌కొంది. 2019 ఎన్నిక‌ల్లో గుజరాత్‌లోని న‌వ్సారీ నుంచి బీజేపీ అభ్య‌ర్థి సీఆర్ పాటిల్ 6.89 ల‌క్ష‌ల మెజారిటీతో, 2014లో వార‌ణాసి నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 5.70 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 ఉపఎన్నికలో క‌డ‌ప నుంచి వైఎస్ జ‌గ‌న్ 5.45 ల‌క్ష‌ల‌ మెజారిటీతో గెలిచారు. మ‌రి ఈ ఎన్నిక‌ల్లోభారీ మెజారిటీ ఎవ‌రిదో!

Similar News

News September 8, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 8, 2025

విశాఖలో మూగ బాలికపై అత్యాచారం!

image

AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

News September 8, 2025

జమ్మూకశ్మీర్‌లో భీకర కాల్పులు

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇద్దరు పారా మిలిటరీ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ, J&K పోలీసులు, శ్రీనగర్ CRPF దళం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.