News June 4, 2024

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యం

image

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3,773 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3,214 ఓట్లు పడ్డాయి.

Similar News

News October 8, 2024

JK 90/90: కాంగ్రెస్‌ 9, NC 39 స్థానాల్లో లీడింగ్

image

జమ్మూకశ్మీర్లో 90 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56కు 39, కాంగ్రెస్ 39కి 9 స్థానాల్లో ఆధిక్యం లభించింది. CPM, JJNNP చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా ఈ కూటమి 49 స్థానాల్లో దూకుడు కొనసాగిస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసినట్టే లెక్క. LG ఐదుగుర్ని నామినేట్ చేసినా వారికి ఫర్వాలేదు. BJP 62 చోట్ల పోటీ చేయగా 29 స్థానాల్లో ముందంజలో ఉంది. PDP 81కి 4 చోట్ల ముందుంది.

News October 8, 2024

రెండు చోట్లా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు. బుద్గాం, గందర్‌బల్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. కాగా లీడింగ్‌పై స్పందించిన ఒమర్ ఫలితాలపై ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన కాంగ్రెస్ ‌కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు.

News October 8, 2024

‘పుష్ప-2’ విడుదల తేదీలో మార్పు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకంటే ముందే రానున్నట్లు చర్చ జరుగుతోంది. డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఒకరోజు ముందుగానే DEC 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు తెలిపాయి.