News June 4, 2024

NDA vs INDIA: క్రాష్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

image

ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.

Similar News

News September 9, 2025

జగన్‌ను జైల్లో పెడతారా? లోకేశ్ సమాధానమిదే!

image

AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్‌ను జైలుకు పంపుతారా?’ అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసే వాళ్లం. కానీ మా దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. నేనైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.

News September 9, 2025

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

image

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉ.10 గంటలకు ప్రారంభమై సా.5 గంటలకు ముగుస్తుంది. సా.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.

News September 9, 2025

EHS పాలసీ విధి విధానాలు త్వరలో ఖరారు: సీఎస్

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కవర్ అయ్యేలా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) విధానాన్ని రూపొందించాలని అధికారులను CS కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నమూనాలను, బీమా కంపెనీ పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలన్నారు. దీని ద్వారా 7,14,322 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని, ఏడాదికి సుమారు ₹1,300Cr ఖర్చవుతుందని అంచనా వేశారు.