News June 4, 2024
NDA vs INDIA: క్రాష్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.
Similar News
News October 8, 2024
UAE నుంచి భారత్కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్
రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.
News October 8, 2024
రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్రావు
AP: ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.
News October 8, 2024
ప్రభుత్వానికి వైన్ డీలర్ల విజ్ఞప్తి
AP: కూటమి ప్రభుత్వానికి ఏపీ వైన్ డీలర్ల సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. నూతన మద్యం పాలసీలోని నిబంధనను 21(5) మార్చాలని కోరింది. హైవేలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు పాఠశాలల నుంచి మద్యం షాపులు ఉండాల్సిన నిర్దేశిత దూరాన్ని కాలినడక ఆధారంగా కొలిచే విధానాన్ని తొలగించడాన్ని ఆక్షేపించింది. ఒకే లైనులో కొలత వేయాలన్న నిబంధన షాపుల ఏర్పాటుకు అవాంతరంగా మారుతుందని పేర్కొంది.