News June 4, 2024
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూటమి హవా
➣సత్తెనపల్లిలో మంత్రి అంబటి వెనుకంజ ➣పెదకూరపాడులో TDP అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 1500 ఓట్ల ఆధిక్యం ➣తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ 7885 ఓట్ల ఆధిక్యం ➣బాపట్లలో TDP అభ్యర్థి నరేంద్ర వర్మ 1394 ఓట్ల ఆధిక్యం ➣మైలవరంలో TDP అభ్యర్థి వసంత 1034 ఓట్ల ఆధిక్యం ➣విజయవాడ వెస్ట్లో BJP అభ్యర్థి సుజనా చౌదరి 2వేల ఓట్ల ఆధిక్యం ➣పెడన, నందిగామ అసెంబ్లీ, గుంటూరు, బాపట్ల MP స్థానాల్లో TDP ఆధిక్యం
Similar News
News October 8, 2024
అందరి చూపు ఆ ఇద్దరిపైనే.. గెలుస్తారా?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 90 సెగ్మెంట్లకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా దేశం మొత్తం ఇద్దరి ఫలితం కోసం ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎంతో ఆదరణ పొందిన రెజ్లర్ వినేష్ ఫొగట్ జులానా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మరొకరు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా. ఈయన మెహమ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
News October 8, 2024
UAE నుంచి భారత్కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్
రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.
News October 8, 2024
రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్రావు
AP: ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.