News June 4, 2024

53వేల ఓట్ల ఆధిక్యంలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి

image

నల్గొండలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 53వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు గెలుపొందింది.

Similar News

News January 23, 2026

పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులు: లోకేశ్

image

AP: ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌కు రాష్ట్రం గమ్యస్థానమని మంత్రి లోకేశ్ తెలిపారు. APకి 160GW పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులుగా మారాయని తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే డేటా సెంటర్లు, AI కంప్యూట్ రంగాలను విస్తరించలేమని దావోస్ రెన్యూ పవర్ మీటింగ్‌లో చెప్పారు.

News January 23, 2026

DRDOలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>DRDO<<>>కు చెందిన ఢిల్లీలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ సైకాలజీ, అప్లైడ్ సైకాలజీ, పీహెచ్‌డీ, NET, GATE అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 23, 2026

నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.