News June 4, 2024
ధర్మాన సోదరుల వెనుకంజ
AP: SKLM జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది. SKLM అసెంబ్లీ అభ్యర్థిగా YCP తరఫున బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై.. TDP అభ్యర్థి గొండు శంకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నరసన్నపేట నుంచి బరిలో దిగిన YCP అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News October 8, 2024
శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
News October 8, 2024
రేపు డబుల్ ధమాకా
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. రేపు అరగంట వ్యవధిలో రెండు మ్యాచులు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్తో రెండో టీ20 మ్యాచులో తలపడనుంది. మరోవైపు సా.7.30 గంటలకు మహిళా టీ20 ప్రపంచ కప్లో శ్రీలంకతో టీమ్ ఇండియా ఆడనుంది. సెమీస్ చేరాలంటే మహిళల జట్టుకు ఈ మ్యాచులో గెలుపు చాలా కీలకం. కాగా బంగ్లాతో తొలి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News October 8, 2024
కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు
ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.