News June 4, 2024

మంత్రి విడదల రజనీ వెనుకంజ.. తాడికొండ, గురజాలలో భారీ మెజార్టీ దిశగా టీడీపీ

image

AP: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీ వెనుకంజలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి 5745 ఓట్ల ముందంజలో ఉన్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ 19వేల ఓట్లు, అమరావతి ప్రాంతమైన తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ 18,272 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 6,969 ఓట్ల ముందంజలో ఉన్నారు.

Similar News

News September 9, 2025

కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

image

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.

News September 9, 2025

సియాచిన్‌లో ప్రమాదం.. ముగ్గురు సైనికుల మృతి

image

లద్దాక్‌లోని సియాచిన్ సెక్టార్‌ బేస్ క్యాంపులో విషాదం జరిగింది. డ్యూటీలో ఉన్న మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, రెస్క్యూ టీమ్స్ 5 గంటల పాటు కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. ప్రాణాలు కోల్పోయిన సైనికులు గుజరాత్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన వారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సియాచిన్ సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

News September 9, 2025

నేపాల్ తదుపరి PM.. ట్రెండింగ్‌లో బాలేంద్ర షా!

image

ఓలీ <<17657494>>రాజీనామాతో<<>> నేపాల్‌ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్‌గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్‌మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు.