News June 4, 2024

రాజ‌స్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింది!

image

రాజ‌స్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింద‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 2019 ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌ను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితుల్లో భారీ మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డి 25 స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 11, ఇత‌రులు 3 స్థానాల్లో త‌మ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు భిన్నంగా ఎర్లీ ట్రెండ్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

Similar News

News October 7, 2024

2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనందరం చూస్తాం: పవన్

image

గుజరాత్ CMగా మోదీ ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు AP Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైంది. ఆయన నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనం చూస్తామని నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు.

News October 7, 2024

RRBలో 7951 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పరీక్ష తేదీల ప్రకటన

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. దీని ద్వారా RRB మొత్తం 7951 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబర్ 25-29 వరకు, RPF ఎస్సై ఎగ్జామ్స్ డిసెంబర్ 2-5 వరకు, టెక్నీషియన్ ఎగ్జామ్స్ డిసెంబర్ 16-26 వరకు ఉంటాయని వివరించింది.

News October 7, 2024

ఆ కుర్చీలో కూర్చుంటే మరణశాసనం రాసుకున్నట్టేనా!

image

హెజ్బొల్లా చీఫ్ హ‌స‌న్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయ‌న వార‌స‌త్వాన్ని స్వీక‌రించ‌డానికి కీల‌క నేత‌లు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవ‌డ‌మంటే మ‌ర‌ణ‌శాస‌నాన్ని రాసుకున్న‌ట్టే అనే భావ‌న‌లో ఉన్నారు. ఈ కార‌ణంతో ఇరాన్ మ‌ద్ద‌తుగల ఈ సంస్థ ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి కీల‌క నేత ఇబ్ర‌హీం అమీన్ నిరాక‌రించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్య‌త‌లు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.