News June 4, 2024

BJP 400 పార్ పాచికలు పారలేదు

image

ఈసారి 400 స్థానాల్లో గెలుస్తామన్న BJP అంచనాలు తలక్రిందులయ్యాయి. 2014, 19లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 273 సాధించిన కమలం పార్టీ ఇప్పుడు ఈ నంబర్‌ను చేరేందుకు ఇబ్బంది పడుతోంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతోనే మోదీ పీఎం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు NDA-INDIA మధ్య సీట్ల తేడా 100 లోపే ఉంది. దీంతో రామమందిరం, GDP, విశ్వగురు, విజన్ 2047 వంటి అంశాలు ప్రజలను అనుకున్నంతగా ఆకట్టుకోలేదని అర్థమవుతోంది.

Similar News

News September 11, 2025

3 బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగలడు!

image

భీముని మనవడు, ఘటోత్కచుని కుమారుడు ‘బార్బరీకుడు’. ఈయన మహాభారత సంగ్రామంలో పాల్గొందామని అనుకుంటాడు. కేవలం 3 బాణాలతోనే యుద్ధాన్ని ముగించగల ప్రతిభ ఆయన సొంతం. కానీ, శ్రీకృష్ణుడు బార్బరీకుణ్ని అడ్డుకుంటాడు. ఆయన రణరంగంలో దిగితే యుద్ధం ఏకపక్షం అవుతుందని గ్రహిస్తాడు. యుద్ధంలో ఎవరూ మిగలరని భావించి శ్రీకృష్ణుడు ఆయన తలను దానంగా అడుగుతాడు. అనంతరం కలియుగంలో ‘శ్యామ్ బాబా’గా పూజలందుకుంటావని వరం ఇస్తాడు.

News September 11, 2025

అభినవ షిరిడీగా పేరొందిన మహిమాన్విత క్షేత్రం

image

నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరులో ఉన్న శ్రీ దత్త వెంకట సాయి ఆలయం, భక్తులకు కొంగుబంగారం. అభినవ షిరిడీగా పేరుపొందిన ఈ క్షేత్రం దత్తాత్రేయ, వెంకటేశ్వర, శివ, శనేశ్వర స్వామి ఆలయాలతో అలరారుతోంది. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కొలువైన సాయినాథుడు భక్తుల కోర్కెలను తీరుస్తాడని, ఎంతో మహిమ గలవాడని భక్తుల నమ్మకం.

News September 11, 2025

ఇంటి గడపను పవిత్రంగా ఎందుకు పరిగణిస్తారు?

image

మన గృహానికి ఉండే ద్వారానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ద్వారం పైభాగంలో ఉన్న కమ్మిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే దానికి మామిడి తోరణం కడతారు. ద్వారం దిగువన ఉన్న గడప కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే దానికి పసుపు రాస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. గడపకు పసుపు పూయడం వల్ల క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నది మరో కారణం.