News June 4, 2024
సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విక్టరీ

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News January 19, 2026
గణతంత్ర వేడుకలకు సిద్దం కావాలి: కలెక్టర్

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకల పై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.
News January 19, 2026
GNT: ఈ-క్రాప్కు కొత్త నిబంధనలు.. రైతులకు ఊరట

గుంటూరు జిల్లాలో రైతులకు అందే ప్రభుత్వ ప్రయోజనాలకు ఈ-క్రాప్ కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో నమోదు సరిగా కాక చాలామంది రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-క్రాప్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రబీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. రైతు సమక్షంలోనే పొలంలో నమోదు చేయాలని ఆదేశించింది. సాగు భూమితో పాటు ఖాళీ భూములను కూడా ల్యాండ్ పార్శిల్గా నమోదు చేస్తున్నారు.
News January 18, 2026
రెవెన్యూ క్లినిక్లు ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం, కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ భూ రికార్డులతో హాజరవుతారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


