News June 4, 2024
బాపట్ల, పెదకూరపాడు, గుంటూరు ఈస్ట్లో టీడీపీ గెలుపు

AP: బాపట్లలో టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ 26,800 మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 88,827 ఓట్లు పోలయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 20,480 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,11,175 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు తూర్పులో టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ 31351 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Similar News
News November 6, 2025
శుభ సమయం (06-11-2025) గురువారం

✒ తిథి: బహుళ పాడ్యమి సా.4.51 వరకు
✒ నక్షత్రం: భరణి ఉ.8.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: రా.7.49-9.19
✒ అమృత ఘడియలు: ఉ.5.20 నుంచి మొదలు
News November 6, 2025
TODAY HEADLINES

➭ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
➭ KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్
➭ 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్లున్నట్టు బిల్డప్ ఇస్తాడు: KTR
➭ APలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
➭ కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని
➭ ఆకాశంలో కనువిందు చేసిన సూపర్ మూన్
➭ PM మోదీతో ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ భేటీ
➭ SA టెస్ట్ సిరీస్కు భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ
News November 6, 2025
ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.


