News June 4, 2024
NDAతోనే నితీశ్: జేడీయూ

ఒప్పందం మేరకు ఎన్డీయేతోనే కొనసాగుతామని జేడీయూ స్పష్టం చేసింది. ‘విపక్షాలు నితీశ్ను తక్కువ అంచనా వేశాయి. మేం ఎన్డీయేతోనే ఉంటాం’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ ట్వీట్ చేశారు. ‘నితీశ్కు సంకీర్ణ ధర్మం తెలుసు. అపోజిషన్ ఆయన్ను తక్కువ అంచనా వేసింది’ అని మరోనేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ‘మా మద్దతు ఎన్డీయేకే. కేంద్రంలో మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని బిహార్ మినిస్టర్ మదన్ సాహ్ని అన్నారు.
Similar News
News January 21, 2026
JAN 25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి వివేక్

TG: ఈ నెల 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్(D) నర్సాపూర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ రాణికుముదిని ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News January 21, 2026
అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
News January 20, 2026
గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్పై చర్చించారు.


