News June 4, 2024
ప్రజలను రక్షించే బాధ్యత మాపై ఉంది: లోకేశ్

AP: గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి ప్రజలను రక్షించే బాధ్యత తమపై ఉందని టీడీపీ నేత లోకేశ్ స్పష్టం చేశారు. ‘గత ఐదేళ్లలో ఎన్నో హామీలు ఇచ్చాం. వాటిని అమలు చేస్తాం. యువగళం పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు వారిని ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నేతలపై విచారణ కమిటీ వేస్తాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Similar News
News January 27, 2026
మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు

US-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అత్యంత శక్తిమంతమైన ‘అబ్రహం లింకన్’ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను మిడిల్ ఈస్ట్ జలాల్లో మోహరించింది. దీంతో పాటు అత్యాధునిక క్షిపణి విధ్వంసక నౌకలు చేరాయి. US అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైనా వైమానిక దాడులకు ఆదేశాలు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు విదేశీ బలగాల మోహరింపును ఇరాన్ వ్యతిరేకిస్తోంది.
News January 27, 2026
భారీగా పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.12వేలు పెరిగి రూ.3,87,000కు చేరింది. 11 రోజుల్లోనే వెండి ధర ₹81వేలు పెరగడం గమనార్హం. అటు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులేదు. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,950, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,450గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 27, 2026
మహాజాతరకు సీఎం దూరం.. కేసీఆర్ డౌటే!

TG: రేపటి నుంచి జరిగే మేడారం మహాజాతరకు CM రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదు. US పర్యటనలో ఉన్న ఆయన FEB 1న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. జాతర ఈ నెల 31తోనే ముగియనుంది. అయితే ఈ నెల 19న రేవంత్ మేడారంలో ఆధునికీకరించిన గద్దెలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరుకావడం లేదని సమాచారం. ఇటీవల మంత్రులు సీతక్క, సురేఖ ఆయనకు ఆహ్వానపత్రిక అందజేశారు.


