News June 4, 2024

ఈ జిల్లాలో ఖాతా తెరవని వైసీపీ

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు ఊడ్చిపారేశాయి. కాగా వైసీపీ కేవలం 11 సీట్లే దక్కించుకుంది.

Similar News

News September 10, 2025

బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

image

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తేజ్-లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.

News September 10, 2025

మాగంటి ఫ్యామిలీకి అండగా నిలవాలి: కేటీఆర్

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి అందరూ అండగా నిలవాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఓ సర్వే ప్రకారం ఇక్కడ మనదే లీడ్ అని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆ పార్టీకి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూల్చుకున్నట్లే’ అని వ్యాఖ్యానించారు. BRS అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

News September 10, 2025

మహాలయ పక్షాల్లో ఏం చేయాలి?

image

మహాలయ పక్షము పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం. ఈ పదిహేను రోజులు గతించినవారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది తరతరాల అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకునే ఆధ్యాత్మిక విధిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాలు, అన్నదానాలు పితృదేవతలకు సద్గతిని ప్రసాదిస్తాయి. మనకు వారి ఆశీర్వాదాలు లభించేలా చేస్తాయి. ఈ కర్మలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తాయి.