News June 4, 2024

ముస్లిం ప్రాంతాల్లో కాంగ్రెస్, ట్రైబల్ ఏరియాల్లో బీజేపీ డామినేషన్

image

సామాజిక వర్గాల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఏకపక్షంగా సాగలేదు. ముస్లిం ప్రజల ఆధిపత్య సెగ్మెంట్లలో ఇండియా 56, ఎన్డీయే 43 చోట్ల ఆధిక్యం ప్రదర్శించాయి. ఆదివాసీ డామినేట్ ప్రాంతాల్లో ఈ సంఖ్య 15, 35గా ఉంది. దళిత ఆధిపత్యం ఉండే చోట్ల 7, 15 సాధించాయి. జనరల్ ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో NDA 228, IND 175తో ఉన్నాయి. ఎస్సీ రిజర్వుడులో 41, 39, ఎస్టీ రిజర్వుడులో 23, 20గా ఈ గణాంకాలు ఉన్నాయి.

Similar News

News September 10, 2025

అమ్మాయిలకి ఈ టెస్టులు చేయించండి..

image

ఆడపిల్లలున్న తల్లిదండ్రులు వారు రజస్వల అయినప్పటి నుంచి వారికి కొన్ని ఆరోగ్య పరీక్షలు కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. రక్తహీనత సమస్యను గుర్తించడానికి కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) పరీక్ష, హార్మోన్ల అసమతుల్యతను గుర్తించడానికి థైరాయిడ్, హార్మోన్ల పరీక్షలు, విటమిన్‌ప్రొఫైల్‌ టెస్ట్‌, ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలుంటే మూత్ర పరీక్ష చేయించాలి. వీటివల్ల ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించే వీలుంటుంది.

News September 10, 2025

యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

image

దేశంలో బ్రేకప్‌‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

News September 10, 2025

ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

image

ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఇస్లాంనగర్‌లో అజార్ డానిష్, ఢిల్లీలో అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ఆయుధాలు, బుల్లెట్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకుంది. వీరిద్దరూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. సెంట్రల్ ఏజెన్సీస్, ఝార్ఖండ్‌ ఏటీఎస్‌తో కలిసి రైడ్స్ చేసి వారిని పట్టుకుంది.