News June 4, 2024

40 ఏళ్ల టీడీపీకి ఆరో గెలుపు

image

తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 1983, 85, 89, 94లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా NTR సారథ్యంలో టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. 1994 తర్వాతి పరిణామాలతో చంద్రబాబు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి 1995లో సీఎం అయ్యారు. బాబు హయాంలో 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.

Similar News

News January 10, 2026

మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

image

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్‌పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.

News January 10, 2026

కన్నవాళ్లే కాటికి పంపుతున్నారు

image

కొందరు తల్లిదండ్రులు కన్నపేగు బంధాన్ని కాలరాస్తున్నారు. AP కృష్ణా(D)లో 45రోజుల పసికందును ఓ తల్లి నీటిగుంటలో విసిరేసింది. TG నారాయణపేట(D)లో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా రంగారెడ్డిలో ఓ తల్లి 11నెలల కొడుకును విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. అత్త సూటిపోటి మాటలు, భార్యతో గొడవలు, భర్త వేధింపులు కారణమేదైనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపడం కలవరపెడుతోంది.

News January 10, 2026

IPO: రికార్డ్ సృష్టించనున్న రిలయన్స్ జియో

image

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్న <<18729228>>విషయం<<>> తెలిసిందే. తద్వారా రూ.40వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రికార్డ్ సృష్టించనుంది. ప్రస్తుతం ఈ స్థానంలో 2024లో రూ.27,870 కోట్లతో ఐపీఓకు వచ్చిన హ్యుందాయ్ ఉంది. ఆ తర్వాత వరుసగా LIC(21,008Cr), పేటీఎం(18,300Cr), జీఐసీ(రూ.11,176Cr) ఉన్నాయి.