News June 5, 2024
కోవూరు తొలి మహిళా MLAగా ప్రశాంతిరెడ్డి

కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. మరోవైపు అక్కడ గెలిచిన తొలి ఎమ్మెల్యే రికార్డును తన బుట్టలో వేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ 14 సార్లు సాధారణ, ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఓ ఏ ఒక్క మహిళకూ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే అవకాశం రాలేదు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రశాంతి రెడ్డి 54, 583 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు.
Similar News
News January 12, 2026
ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News January 12, 2026
ఊర్లకు వెళ్లేవారు LHMS యాప్ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల కోరారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్ను వాడాలని సూచించారు. రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచామన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News January 12, 2026
నెల్లూరు: రూ.1.20 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం

అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులు ఇతర రాష్ట్రాల్లో లగ్జరీ కార్లను దొంగిలించి, నకిలీ నంబర్ ప్లేట్లు, డూప్లికేట్ పత్రాలతో విక్రయిస్తున్నారు. వారిని దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రూ.1.20 కోట్ల విలువైన 2 కార్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.


