News June 5, 2024
ఏపీ ఎన్నికల్లో కుట్ర జరిగింది: ఎస్సీ కమిషన్ సభ్యుడు
APలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని రాష్ట్ర SC కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో EC కుట్ర చేసిందన్నారు. తక్షణమే ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. TDP నేతలకు వేలల్లో, BJP MP అభ్యర్థులకు లక్షల్లో మెజార్టీ, JSP 21 సీట్లలో గెలవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని మెజార్టీ సర్వేలు వెల్లడించాయన్నారు.
Similar News
News October 7, 2024
జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోసం కోర్టుకు పోలీసులు!
అత్యాచారం కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది.
News October 7, 2024
అడిగిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు మంత్రి
చెన్నై ఎయిర్ షోకు కోరిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వైద్య బృందాలతో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిన్న ఈవెంట్కు వచ్చిన జనం అవస్థలు పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని BJP రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.
News October 7, 2024
నేడు విచారణకు నాగార్జున పిటిషన్
తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.