News June 5, 2024
నీట్ ఫలితాలు.. కటాఫ్ ఎంతంటే?

నిన్న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ నుంచి 43,858 మంది, తెలంగాణలో 47,371 మంది అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు వంద లోపు ర్యాంకుల్లో నిలిచారు. పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్ విభాగం కటాఫ్ 164, EWSకు 146, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 129గా నిర్ణయించారు. ఈ మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు.
Similar News
News January 7, 2026
పసుపు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

పసుపు రకాన్ని బట్టి పంట కాలం 7 నుంచి 9 నెలలుగా ఉంటుంది. పసుపు పంట పక్వానికి వచ్చిన తర్వాతే కోత కోయడం ప్రారంభించాలి. పక్వానికి రాకముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతో పాటు, కుర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయి, తర్వాత ఎండిపోయి నేలపై పడిపోతే పంట కాలం పూర్తి అయ్యిందని గుర్తించవచ్చు. ఈ దశలో దుంపలను, కొమ్ములను తవ్వి తీయాలి.
News January 7, 2026
తూర్పు గోదావరి జిల్లాలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

AP: రాజమహేంద్రవరంలోని GMC, GGHలో 60పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా( అనస్థీషియా టెక్నీషియన్, కార్డియాలజీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్& ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ECG), బీఎస్సీ, DMLT, BSc(MLT), ఇంటర్(ఒకేషనల్), CLISc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in
News January 7, 2026
మనీషా పంచకం ఎందుకు చదవాలి?

మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, అహంకారాన్ని తొలగించుకోవడానికి మనీషా పంచకం చదవాలి. బాహ్య రూపం, కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం అజ్ఞానమని, అందరిలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటేనని ఇది బోధిస్తుంది. సమదృష్టిని పెంపొందించుకోడానికి, సత్యం వైపు పయణించడానికి ఇవి మార్గదర్శకాలు. ‘నేను శరీరాన్ని కాదు, ఆత్మను’ అనే సత్యాన్ని గ్రహించిన రోజే మనిషికి సంపూర్ణ విముక్తి లభిస్తుందని శంకరాచార్యులు ఇందులో స్పష్టం చేశారు.


