News June 5, 2024
నీట్ ఫలితాలు.. కటాఫ్ ఎంతంటే?

నిన్న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ నుంచి 43,858 మంది, తెలంగాణలో 47,371 మంది అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు వంద లోపు ర్యాంకుల్లో నిలిచారు. పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్ విభాగం కటాఫ్ 164, EWSకు 146, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 129గా నిర్ణయించారు. ఈ మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు.
Similar News
News December 28, 2025
సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!
News December 28, 2025
DRDOలో JRF పోస్టులు

DRDO పరిధిలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(<
News December 28, 2025
‘అర్బన్ నక్సల్స్’పై NIA ఫోకస్.. రాబోయే రోజుల్లో అరెస్టులు!

యువతలో మావోయిస్టు భావజాలాన్ని నూరిపోస్తున్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్లపై NIA ఫోకస్ పెట్టింది. అడవుల్లో మావోయిస్టులను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నా కొందరు మేధావుల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారని సీరియస్గా ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మావోలను హీరోలుగా వర్ణిస్తూ అమాయకులను అడవిబాట పట్టిస్తున్నట్లు గుర్తించింది. రాబోయే రోజుల్లో అలాంటి వారిని అరెస్టు చేయడానికి ప్లాన్లు వేస్తోంది.


