News June 5, 2024

సెలవుపై విదేశాలకు సీఐడీ బాస్

image

AP: చంద్రబాబుపై పలు కేసులు, ఆయన అరెస్టులో కీలక పాత్ర వహించిన CID అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతించడం గమనార్హం. ఇటు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన కీలక దస్త్రాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి.

Similar News

News July 4, 2025

భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

image

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

News July 4, 2025

ఖాళీ అవుతోన్న ‘తువాలు’

image

పసిఫిక్ మహాసముద్రంలోని కేవలం 5 మీటర్ల ఎత్తులో ఉండే ‘తువాలు’ దేశం ఖాళీ అవుతోంది. కొన్ని దీవుల సముదాయమైన ఈ దేశంలోని మెజారిటీ భూభాగం 2050 నాటికి సముద్రంలో కలిసిపోతుందని NASA హెచ్చరించడంతో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంతో ‘క్లైమెట్ వీసా’ కోసం దేశంలోని 10643 మందిలో మూడో వంతు ప్రజలు అప్లై చేసుకున్నారు. కానీ ఏడాదికి 280 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.

News July 4, 2025

ఇంగ్లండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్

image

INDతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (57*), స్మిత్ (57*) దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు (4, 6, 4, 4, 4) బాదారు. ఆ ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ENG స్కోర్ 169/5గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 6 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నారు.