News June 5, 2024
సాయంత్రం ఇండియా కూటమి భేటీ

పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన INDIA కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు AICC చీఫ్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. తాజా ఫలితాల్లో ఇండియా కూటమి 234 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 99 సీట్లలో గెలిచింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి బయట పార్టీలను కూడా ఆహ్వానించే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Similar News
News November 9, 2025
లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

లిల్లీ పూలను విడి పువ్వులుగా, కట్ ఫ్లవర్స్గా, దండలకు, బొకేల తయారీకి, సుగంద ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారు. లిల్లీ పూలలో అనేక రకాలున్నాయి.
☛ సింగిల్ రకాలు : వీటిలో పూల రేకులు ఒక వరసలో అమరి ఉంటాయి.
☛ ఉదా: కలకత్తా సింగిల్, హైదరాబాద్ సింగిల్, మెక్సికన్ సింగిల్, ఫులే రజిని, ప్రజ్వల్, రజత్ రేఖ, శ్రింగార్, అర్కా నిరంతర. వీటిని విడి పువ్వులుగా, పూల దండల కోసం, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి వినియోగిస్తారు.
News November 9, 2025
NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్నాథ్ సింగ్

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.
News November 9, 2025
సమాజం కోసం ఏర్పడిందే RSS: మోహన్ భాగవత్

RSS సమాజం కోసం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ‘ఆర్ఎస్ఎస్ దేనికీ వ్యతిరేకం కాదు. అది అధికారాన్ని కోరుకోదు. సమాజంలో ప్రాధాన్యతను ఆశించదు. దేశ కీర్తి పెంచేందుకు సేవ చేయాలని కోరుకుంటుంది. మొదట్లో RSSను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు’ అని అన్నారు. RSS 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


