News June 5, 2024
తెలంగాణలో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్?
తెలంగాణలోని లోక్సభ స్థానాలను కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక సీటు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ అత్యధికంగా 40.10శాతం ఓటు షేర్ (87,41,263ఓట్లు) పొందింది. బీజేపీ 35.08శాతం ఓట్ షేరు (76,47,424 ఓట్లు)తో రెండో స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ 16.68 శాతం ఓటు షేర్తో మూడో స్థానంలో నిలిచింది. ఎంఐఎం 3.092శాతం ఓటు షేర్(6,59,278 ఓట్లు) పొందింది.
Similar News
News October 7, 2024
జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోసం కోర్టుకు పోలీసులు!
అత్యాచారం కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది.
News October 7, 2024
అడిగిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు మంత్రి
చెన్నై ఎయిర్ షోకు కోరిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వైద్య బృందాలతో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిన్న ఈవెంట్కు వచ్చిన జనం అవస్థలు పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని BJP రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.
News October 7, 2024
నేడు విచారణకు నాగార్జున పిటిషన్
తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.