News June 5, 2024
విశాఖ: కుటుంబంలో ముగ్గురూ ఓటమి

వార్డు మెంబర్ నుంచి ఉపముఖ్యమంత్రి అయిన బూడికి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. అనకాపల్లి MPగా పోటీ చేసి.. సీఎం రమేశ్ చేతిలో 2,96,630 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనూహ్యంగా వైసీపీ తరఫున మాడుగుల MLA బరిలో దిగిన అతని కుమార్తె ఈర్లె అనూరాధకు కూడా ఓటమి తప్పలేదు. TDP అభ్యర్థి బండారు 28,026 ఓట్ల మెజార్టీతో ఆమెపై గెలిచారు. మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అతని కుమారుడికి 395 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Similar News
News January 12, 2026
విశాఖలో తాగునీటి సమస్యలా? ఈ నెంబరుకు కాల్ చేయండి

నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని జీవీఎంసీ అందిస్తుందని జీవీఎంసీ కమీషనర్ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. నీటి సరఫరాలో సమస్యలు కలిగినట్లయితే వెంటనే జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్నారు. తాగునీటి పైపుల లీకేజీ, కలుషిత నీరు, కాలువలలో నీటి పైప్ లైన్ల లీకేజీ, తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News January 12, 2026
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా విద్యాధరి

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News January 12, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


