News June 5, 2024

పార్టీల వారీగా ఓట్ల పర్సంటేజ్

image

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 36.56శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానాల్లో INC(21.19%), SP(4.58%), TMC(4.37%), YSRCP(2.06%), BSP(2.04%), TDP(1.98%) RJD(1.57%), శివసేనUBT(1.48%), BJD(1.46%), NCP-శరద్ పవార్(0.92%) పార్టీలున్నాయి.

Similar News

News January 10, 2026

నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్‌ని: రేవంత్

image

TG: తాను వైద్యుడిని కాదని, సోషల్ డాక్టర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో నైపుణ్యాలు పెంచుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లే. క్వాలిటీ ఆఫ్ హెల్త్ గురించి అంతా కృషి చేయాలి’ అని ఆయన కోరారు.

News January 10, 2026

ట్రంప్‌కు నోబెల్ ఆఫర్.. స్పందించిన నార్వే కమిటీ!

image

తనకు లభించిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇస్తానని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో చెప్పడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందించింది. ‘నోబెల్ బహుమతిని రద్దు చేయడం, ఇతరులతో పంచుకోవడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. ఒకసారి ప్రకటన చేసిన తర్వాత అదే శాశ్వతం’ అని స్పష్టం చేసింది. 8 యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి <<18812581>>రావాల్సిందంటూ<<>> ట్రంప్ తరచూ చెబుతున్న విషయం తెలిసిందే.

News January 10, 2026

ఈశాన్యంలో కాకుండా ఆగ్నేయంలో నీరు పడితే?

image

ఈశాన్యంలో బోరు వేస్తే నీరు పడనప్పుడు నీటి సంపద ఆగ్నేయంలోనూ ఉండవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఆగ్నేయంలో బోరు వేయడం తప్పు కాదు. నీరు లభించడమే అదృష్టంగా భావించాలి. అయితే ఆగ్నేయ బోరు వల్ల కలిగే దోష నివారణకు ఈశాన్యంలో ఓ ఇంకుడు గుంత నీటి నిల్వ తొట్టి నిర్మించాలి. దాన్నెప్పుడూ నీటితో ఉంచాలి. ఇంకుడు గుంత ఏర్పాటుతో భూగర్భ జలాలను కాపాడి వాస్తు సమతుల్యత పాటించవచ్చు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>