News June 5, 2024
పల్నాడులో రక్తచరిత్ర.. ఇకనైనా ఆగేనా?
AP: గతంలో ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ పేరు వినిపించేంది. ఇప్పుడు పల్నాడు పేరు మారుమోగుతోంది. ఈ ప్రాంతం చాన్నాళ్లు ప్రశాంతంగానే ఉన్నా.. ఐదేళ్లలో ఫ్యాక్షన్ పడగ విప్పింది. పార్టీలు, ఆధిపత్య పోరులో కుత్తుకలు తెగాయి. TDP కార్యకర్త చంద్రయ్యను నడిరోడ్డుపై చంపిన తీరు చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది. పోలింగ్ రోజున చెలరేగిన హింసను చూసి దేశం నివ్వెరపోయింది. మరి కొత్త ప్రభుత్వంలోనైనా పల్నాడు చల్లబడుతుందేమో చూడాలి.
Similar News
News October 7, 2024
22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్
AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
News October 7, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్
టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.
News October 7, 2024
బతుకమ్మకు అమెరికాలో అరుదైన గౌరవం
తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు ఈ పండుగను అధికారికంగా గుర్తించాయి. అంతే కాకుండా ఈ వారాన్ని హెరిటేజ్ వీక్గా ప్రకటిస్తూ ఆ రాష్ట్రాల గవర్నర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై అమెరికాలోని తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.