News June 5, 2024

ఎన్డీఏ మిత్రపక్షాలతో రాష్ట్రపతిని కలవనున్న మోదీ

image

కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎల్లుండి బీజేపీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్నారు. తర్వాతి రోజు(8న) ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Similar News

News October 7, 2024

భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.

News October 7, 2024

గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన

image

INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

News October 7, 2024

రన్నింగ్‌ బస్సు‌లో డ్రైవర్‌కు గుండెపోటు

image

TG: గుండెపోటుకు గురైనా ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణను మరువలేదు. 45 మంది ప్రాణాలను కాపాడి, ఆయన తనువు చాలించారు. హుజూరాబాద్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్‌ సింగ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.