News June 5, 2024

సిరిపురం జంక్షన్‌లో స్టాపర్లు తొలగించాలని నిరసన

image

విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్‌బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా..సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.

Similar News

News November 1, 2025

ప‌ర్యాట‌క ప్రాంతాలను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

న‌గ‌రంలోని పార్కుల‌ను, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను మ‌రింత ఆక‌ర్షణీయంగా తీర్చిదిద్దాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జ‌రిగే ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 1, 2025

విశాఖ నుంచి బయల్దేరిన మంత్రి లోకేశ్

image

విశాఖ విమానాశ్రయానికి మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం సాయంత్రం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసిలాట ఘటనలో క్షతగాత్రులను వీరు పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మంత్రులు లోకేష్, అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వెళ్లారు.

News November 1, 2025

విశాఖలో DRO నియామకం ఎప్పుడో?

image

విశాఖలో DRO, RDO మధ్య జరిగిన వివాదంతో ఇద్దరినీ బదిలీ చేశారు. DRO భవానీ శంకర్ స్థానంలో JCకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే మరో 2 వారాల్లో నగరంలో CII భాగస్వామ్య సదస్సుతో పాటు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. సాధారణంగా ప్రోటోకాల్ వ్యవహారాలు, ముఖ్య అధికారుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం వంటి పనులన్నీ DRO పరిధిలో ఉంటాయి. ఈ సమయంలో DRO స్థానం ఖాళీగా ఉండడంతో వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.