News June 5, 2024
ఈ లక్షణాలున్నాయా?.. జాగ్రత్త
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇందులో సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ వాడకానికే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు ఉన్నాయని ఓ సర్వే పేర్కొంది. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో వీలైనంత ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News October 6, 2024
గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించలేను: ప్రియా భవానీ
గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అన్నారు. తన శరీరాన్ని ఒక వస్తువుగా భావించనని చెప్పారు. ‘కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే నేను ఏ విషయంలోనూ బాధపడకూడదు. అందుకు అనుగుణంగా ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటా. అలాగే ఫ్యాషన్ పేరుతో కొన్నింటిని ప్రమోట్ చేయను’ అని ఆమె తెగేసి చెప్పారు. కాగా ప్రియా భవానీ ‘కళ్యాణం కమనీయం’, ‘రత్నం’ తదితర చిత్రాల్లో నటించారు.
News October 6, 2024
Air Indiaపై హాకీ క్రీడాకారిణి ఫైర్
విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికుల లగేజీపై ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్నది సామాన్యులకు తెలిసిందే. ఈ అనుభవం ఇప్పుడు స్టార్ హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్కు ఎదురైంది. ఇటీవల అమె Air India విమానంలో కెనాడా నుంచి ఢిల్లీ వచ్చారు. అయితే, ఆమె లగేజీ ధ్వంసమవ్వడంపై మండిపడ్డారు. ‘మీ అద్భుతమైన బహుమానానికి ధన్యవాదాలు. మీ సిబ్బంది మా బ్యాగ్లను ఇలా చూస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 6, 2024
CM చంద్రబాబును కలిసిన మాజీ CM
AP: మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఇరువురూ చర్చించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కిరణ్ కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.