News June 5, 2024
33% మేర పతనమైన రైల్వే స్టాక్స్

గత హయాంలో మోదీ ప్రభుత్వం రైల్వేపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో ఈ స్టాక్స్ రెండు రోజుల్లోనే 33% వరకు క్రాష్ అయ్యాయి. టిటాగఢ్ రైల్వే సిస్టమ్స్ 33, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 26, రైల్ టెల్ కార్ప్, IRCTC చెరో 19, RITES, IRFC, RVNL, టెక్స్మాకో, జూపిటర్ వ్యాగన్స్ షేర్లు 18-23% మేర క్షీణించాయి. NDA-3 ప్రభుత్వం స్థిరపడే దాక ఈ షేర్లలో కరెక్షన్ తప్పకపోవచ్చు.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

<


