News June 5, 2024
లోక్సభ ఫలితాల్లో అత్యల్ప మెజార్టీ వీరికే
☛ రవీంద్ర దత్తారామ్ వైకర్ – శివసేన- ముంబై నార్త్ వెస్ట్- 48 ఓట్ల మెజార్టీ
☛ అదూర్ ప్రకాశ్- కాంగ్రెస్- అత్తింగళ్(కేరళ)- 684 ఓట్ల మెజార్టీ
☛ నారాయణ్ బెహరా- BJP-జయపురం(ఒడిశా) -1587 ఓట్ల మెజార్టీ
☛ అనిల్ చోప్రా-కాంగ్రెస్-జైపూర్-1615 ఓట్ల మెజార్టీ
☛ భోజ్రాజ్ నాగ్-BJP-కాంకేర్(ఛత్తీస్గఢ్)-1884 ఓట్ల మెజార్టీ
Similar News
News October 6, 2024
ఈరోజు మయాంక్కి చోటివ్వాల్సిందే: ఆకాశ్ చోప్రా
బంగ్లాదేశ్తో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత ప్లేయింగ్ లెవన్లో మయాంక్ యాదవ్ను ఆడించాల్సిందేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ‘మయాంక్ లాంటి ఫాస్ట్ బౌలర్ను స్క్వాడ్లోకి తీసుకుంటే కచ్చితంగా ఆడించాల్సిందే. తన ఫస్ట్ క్లాస్ మ్యాచుల రికార్డును పట్టించుకోకుండా జాతీయ జట్టుకి తీసుకున్నారు. అలాంటప్పుడు అతడికి అవకాశం ఇవ్వాల్సిందే. కత్తిని కొనేది దాచుకునేందుకు కాదుగా?’ అని ప్రశ్నించారు.
News October 6, 2024
90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్
TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
News October 6, 2024
భారత్ టార్గెట్ 106 రన్స్
మహిళల టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.