News June 5, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులపైన అత్యధిక మెజారిటీ
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రుల పైనే కూటమి అభ్యర్థులు ఎక్కువ మెజారిటీ సాధించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో 59,915 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు సెంట్రల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా 68,886 ఓట్ల తేడాతో ఉమ చేతిలో ఓడిపోయారు. కాగా ఉమ్మడి కృష్ణాలో ఈ మెజార్టీలే అత్యధికం.
Similar News
News September 29, 2024
’30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు ధన్యవాదాలు’
రాష్ట్రానికి 30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ పశ్చిమ MLA సుజనా ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ట్వీట్ చేశారు. అమరావతిలో రూ.250కోట్లతో 400 పడకల ESI ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేసిందని సుజనా తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News September 29, 2024
తప్పు చేసుంటే అరెస్ట్ చేసుకోండి: పేర్ని నాని
తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫైల్స్ వెతికారని, అసైన్డ్ పట్టాలు చూశారన్నారు. తాను తప్పు చేసింటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు.
News September 29, 2024
కృష్ణా: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కానూరు తులసినగర్లోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18- 35 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు అక్టోబర్ 3లోపు ఈ శిక్షణకు ఫెడరల్ స్కిల్ అకాడమీలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. Shareit