News June 5, 2024

ఉమ్మడి జిల్లాలో సగం మంది పాలకులు మహిళలే

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగం మంది మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులే పాలన కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారు మహిళలే కావడం విశేషం. WGL, HNK, ములుగు జిల్లాల కలెక్టర్లు కూడా మహిళా IASలే. వరంగల్, MHBD, భూపాలపల్లి ZP ఛైర్మన్లుగా వారే ఉన్నారు. GWMC మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా ఉండగా.. తాజాగా నిన్న వరంగల్ ఎంపీగా కావ్య గెలిచారు. పాలకుర్తి MLAగా యశస్విని రెడ్డి ఉన్నారు.

Similar News

News January 9, 2026

మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

image

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2026

వరంగల్: 5 కొత్త లేఅవుట్లకు అనుమతి

image

కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు జిల్లా లేఅవుట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఐదు లేఅవుట్లకు తుది అనుమతులు మంజూరు చేశారు. పైడిపల్లి, దేశాయిపేట, స్తంభంపల్లి, నక్కలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు

News January 9, 2026

వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.