News June 5, 2024

భూగర్భజలాలు 3.5డిగ్రీలు వేడెక్కుతాయి: అధ్యయనం

image

శతాబ్ధం చివరినాటికి భూగర్భ జలాలు 2-3.5డిగ్రీల వరకు వేడెక్కుతాయని ఓ పరిశోధన తెలిపింది. దీనివల్ల నీటినాణ్యత, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. జర్మనీలోని కార్ల్స్‌రుహ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం భూగర్భ జలాలపై ఎలా ఉంటుందో వివరించింది.

Similar News

News January 17, 2026

ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్

image

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీటితో<<>> 24 మంది మరణించడంతో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గిల్ అప్రమత్తమయ్యారు. రూ.3 లక్షల విలువైన స్పెషల్ వాటర్ ప్యూరిఫికేషన్ మెషీన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ఈ మెషీన్ RO, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీటినీ శుద్ధి చేయగలదని నేషనల్ మీడియా పేర్కొంది. దాన్ని గిల్ తన గదిలో ఉంచుకోనున్నట్లు చెప్పింది. కాగా రేపు ఇండోర్‌లో భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే జరగనుంది.

News January 17, 2026

వేప మందుల వాడకంలో మెళకువలు

image

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.

News January 17, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఎక్జిమ్<<>> బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు నేటినుంచి FEB 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ , PG (MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్, IB, CAలో స్పెషలైజేషన్ చేసినవారు అర్హులు. వయసు 21- 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.eximbankindia.in/