News June 5, 2024
NOTAకు 63 లక్షల ఓట్లు!

లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బిహార్లో 8.97లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32L, ప.బెంగాల్లో 5.22L, తమిళనాడులో 4.61లక్షలు, గుజరాత్ లో 4.49లక్షలు, మహారాష్ట్రలో 4.12L, ఏపీలో 3.98L, ఒడిశాలో 3.24లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2019 ఎన్నికల్లో 65.22L ఓట్లు పడగా, ఈసారి ఆ సంఖ్య 2L తగ్గింది.
Similar News
News September 11, 2025
నేపాల్ నిరసనలకు ముఖ్య కారణం ఇతడేనా?

నేపాల్ ఆందోళనలకు Hami Nepal అనే NGO ప్రెసిడెంట్ సుడాన్ గురుంగ్ ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 2015లో భూకంపం తర్వాత ఈ NGOను స్థాపించారు. దీనికి అమెరికా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాపై బ్యాన్ విధించే ఒకరోజు ముందు (SEP 8న) ఎలా నిరసన చేయాలో చెబుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దీంతో నేపాల్ ప్రభుత్వ మార్పు వెనుక US ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
News September 11, 2025
కుల్దీప్ అదరగొట్టాడు.. కానీ నెక్స్ట్ మ్యాచులో ఉండడు: మంజ్రేకర్

UAEతో <<17672914>>మ్యాచులో<<>> 4 వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ను తదుపరి మ్యాచులో పక్కన పెడతారని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఎప్పుడైతే అతడు అద్భుతంగా రాణిస్తాడో.. నెక్స్ట్ మ్యాచ్లో చోటు కోల్పోతాడు. నేను జస్ట్ జోక్ చేస్తున్నా. కానీ టీమ్ ఇండియాలో అతడి కెరీర్ను చూస్తే ఇదే అర్థమవుతోంది. సత్తా ఉన్న ఆటగాడికి ఇలా జరుగుతోంది. అంతా అతడి తలరాత’ అని వ్యాఖ్యానించారు.
News September 11, 2025
ఈ నెల 15న తెలంగాణ క్యాబినెట్ భేటీ

TG: రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 15న సమావేశం కానుంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలపై చర్చించనుంది. ఓవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండగా, మరోవైపు 42% BC రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.