News June 5, 2024
NOTAకు 63 లక్షల ఓట్లు!
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బిహార్లో 8.97లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32L, ప.బెంగాల్లో 5.22L, తమిళనాడులో 4.61లక్షలు, గుజరాత్ లో 4.49లక్షలు, మహారాష్ట్రలో 4.12L, ఏపీలో 3.98L, ఒడిశాలో 3.24లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2019 ఎన్నికల్లో 65.22L ఓట్లు పడగా, ఈసారి ఆ సంఖ్య 2L తగ్గింది.
Similar News
News October 6, 2024
90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్
TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
News October 6, 2024
భారత్ టార్గెట్ 106 రన్స్
మహిళల టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.
News October 6, 2024
కుమారులు సినిమాల్లోకి వస్తారా? జూ.ఎన్టీఆర్ సమాధానమిదే
తన కుమారులు అభయ్, భార్గవ్లను సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు జూ.ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నచ్చదన్నారు. వాళ్లిద్దరి ఆలోచనా తీరులో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘మూవీల్లోకి రావాలి.. యాక్టింగ్లోనే రాణించాలని వాళ్లను ఫోర్స్ చేయను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను అలా ట్రీట్ చేయలేదు. పిల్లలకు వారి సొంత ఆలోచనలు ఉండాలనుకుంటా’ అని పేర్కొన్నారు.