News June 6, 2024
YCP ఘోర ఓటమి.. AAG పొన్నవోలు రాజీనామా

AP: YCP ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్దిరోజుల తర్వాత రాజీనామా చేసే ఛాన్సుంది.
Similar News
News September 11, 2025
ALERT: కాసేపట్లో భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే మెదక్లో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు దంచికొడుతున్నాయి.
News September 11, 2025
4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
News September 11, 2025
ఏ వాస్తు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?

వాస్తు శాస్త్రంపై ఏ ఒక్క రుషి రచనను ప్రామాణికంగా తీసుకోవాలన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం వేర్వేరు మార్గాల్లో వెళ్లినా చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినట్లుగా.. ఏ వాస్తు శాస్త్రాన్ని అనుసరించినా దాని లక్ష్యం ఒకటే ఉంటుంది. అందరు మహర్షులు సమాజ హితం కోసమే ఈ రచనలు చేశారు. మీరు ఏ వాస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నా అందులో సూత్రాలు మారవు. బాగా ప్రాచుర్యం పొందిన వాస్తు శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది.