News June 6, 2024
ప్రకాశం: కోడలిని చంపిన అత్తకు రెండు జీవిత ఖైదీ శిక్షలు

నిజామాబాద్ జిల్లాకి చెందిన బానోతు రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను 2020న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాంసింగ్ తల్లి పద్మావతి కోడలిని నిత్యం కట్నం తేవాలని వేధించేది. తనకు ఎవరూ లేరని కట్నం తేలేనని వాపోయేది. రాధను చంపేసి మరో పెళ్లి చేయొచ్చుని కొడుకుతో పన్నాంగం పన్నింది. 2020 ఏప్రిల్ 20న రాధపై పెట్రోల్ పోసి హత్యచేశారు. బుధవారం పద్మావతికి 2 జీవిత ఖైదీ శిక్ష పడింది. రాంసింగ్ పరారీలో ఉన్నాడు.
Similar News
News January 9, 2026
ఈనెల 14న ఉమ్మడి ప్రకాశం జిల్లా షటిల్ టోర్నమెంట్

పర్చూరులోని NTR క్రీడా వికాస కేంద్రంలో ఈ నెల 14న మెన్ డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ సమీవుల్లా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. విజేతలకు 1వ బహుమతిగా రూ.15,116లు, 2వ బహుమతి రూ.10,116లు, 3వ బహుమతి రూ.5,116లు, 4వ బహుమతి రూ.3,116లగా నిర్ణయించినట్లు చెప్పారు. వివరాలకు స్టేడియం నిర్వాహకులను సంప్రదించాలన్నారు.
News January 9, 2026
ప్రకాశం: రుణాలు పొందిన వారికి గుడ్ న్యూస్

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అటువంటి వారి కోసం ప్రస్తుతం వడ్డీ రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా రుణాలు వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.
News January 8, 2026
సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.


