News June 6, 2024
కురిచేడు: రిజర్వాయర్లో పసికందు మృతదేహం

కురిచేడు మండలం అట్లపల్లి రిజర్వాయర్లో పసి కందు మృతదేహం బయటపడింది. బుధవారం సాయంత్రం చెరువు పక్కనే పొలం పనులు చేసుకునే వారు కట్టమీద వెళుతుండగా పసికందు మృతదేహాన్ని గుర్తించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు మహిళలు చెరువు కట్టమీద అనుమానస్పదంగా తిరుగుతూ బిడ్డను వదిలేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్ఏపీ రక్షిత నీటి పథకం సిబ్బంది వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చెరువును శుభ్రం చేశారు.
Similar News
News December 26, 2025
ప్రకాశం జిల్లాలో TDP మొదలెట్టింది.. జనసేన ఎప్పుడో..?

ప్రకాశం జిల్లాలో TDP జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే TDPకి బూత్, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. అయితే జనసేన అదే తరహా కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యత కార్యక్రమంలో ప్రకటించారు. కాగా జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ సారథ్యంలో బూత్, గ్రామ కమిటీల నియామకం ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
News December 26, 2025
ప్రకాశం: పండగలకు ఊరు వెళ్తున్నారా..!

సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. దీంతో అందరూ బంధుమిత్రుల గ్రామాలకు తరలి వెళ్తారు. దీంతో కొందరు తాళాలు వేసిన గృహాలను టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారన్నారు. ఈ సమయంలో ప్రకాశం పోలీసులు అందించే ఫ్రీ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని SP హర్షవర్ధన్ రాజు గురువారం కోరారు. LHMS సర్వీస్ను ప్రజలు ఉచితంగా పొందాలన్నారు. సమాచారం అందించిన ఇంటిని CC కెమెరాతో నిఘా ఉంచి, భద్రత కల్పిస్తామన్నారు.
News December 25, 2025
ప్రకాశం జిల్లా మెప్మా పీడీపై చర్యలు

ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతోంది. విచారణ పర్వంలోనే పీడీని సరెండర్ చేయడం విశేషం.


