News June 6, 2024
నాలుగు శాఖలను అట్టిపెట్టుకోనున్న BJP?

కేంద్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి వర్గ కూర్పులో భాగంగా నాలుగు మంత్రిత్వ శాఖలను తామే అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలను తీసుకోవాలని చూస్తోందట. నితీశ్ నేతృత్వంలోని JD(U) రైల్వేను టార్గెట్ చేసిందట. కీలక శాఖల్లో సహాయ మంత్రి పదవులను కూటమిలోని ఇతర పార్టీలకు ఇవ్వాలని యోచిస్తోందని తెలుస్తోంది.
Similar News
News September 9, 2025
TODAY HEADLINES

* ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు: సీఎం రేవంత్
* హిందీ తప్పనిసరని ఎక్కడా చెప్పలేదు: లోకేశ్
* రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న
* ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం
* బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి
* ఉపరాష్ట్రపతి ఎన్నికకు మా ఎంపీలు దూరం: KTR
* అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి రాజారెడ్డి: షర్మిల
* టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్
News September 9, 2025
‘స్వదేశీ మేళా’లు నిర్వహించండి.. NDA ఎంపీలకు ప్రధాని పిలుపు

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు NDA ఎంపీలు ‘స్వదేశీ మేళా’లను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. GST రేట్ల తగ్గింపుపై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, GST సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు MPలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDA MPలతో ఆయన సమావేశమయ్యారు. ఓటు వృథా కాకుండా సరైన పద్ధతిలో వేయాలన్నారు.
News September 9, 2025
పంజాబ్ వరదలు.. భజ్జీ మంచి మనసు

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.