News June 6, 2024
రైతులను కంగనా ఏమన్నారంటే?

ఎంపీ కంగనా రనౌత్ను చెంప <<13392690>>దెబ్బ<<>> కొట్టిన ఘటనకు గతంలో రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. CAA బిల్లుతో పౌరసత్వం పోతుందని రక్తపాతం సృష్టించేందుకు టెర్రరిస్టులు రైతులుగా చెలామణి అవుతున్నారని గతంలో ఆమె ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించేది వారేనని ఆరోపించారు. ఆ తర్వాత తాను రైతులను టెర్రరిస్టులు అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.
News November 3, 2025
శక్తిమంతమైన శివ మంత్రాలు

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. కరచరణా కృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా
సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ్ శంభో


