News June 7, 2024

HYD: తెలంగాణలోనూ TDP గెలుస్తుంది: మాజీ MLA

image

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ పూర్వ వైభవం వస్తుందని, ఇక్కడ కూడా భవిష్యత్తులో గెలుస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, షాద్‌నగర్ మాజీ MLA బక్కని నర్సింహులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో షాద్‌నగర్‌లో గురువారం టీడీపీ నాయకులు బక్కని నర్సింహులును సన్మానించి, అభినందనలు తెలిపారు.

Similar News

News October 2, 2024

HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!

image

HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT

News October 2, 2024

HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.

News October 2, 2024

HYD: బాపు‌ఘాట్‌లో గవర్నర్ నివాళులు

image

సత్యం, అహింస, ప్రేమ, స్వచ్ఛత అనే విలువలకు కట్టుబడి ప్రజలు మహాత్మా గాంధీ కలలు కన్న భారతం సాకారం చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులర్పించారు.