News June 7, 2024
అప్పలనాయుడు ఫ్లైట్ టికెట్ ఉందా?: చంద్రబాబు

AP: నిన్న TDP MPలతో చంద్రబాబు భేటీలో ఆసక్తికర ఘటన జరిగింది. కార్యకర్త స్థాయి నుంచి విజయనగరం MPగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడిని CBN అభినందించారు. ‘ఢిల్లీకి రావడానికి విమాన టికెట్ ఉందా అప్పలనాయుడు? లేకపోతే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు’ అని CBN అడగటంపై మిగతా MPలు భావోద్వేగానికి గురయ్యారు. అతని స్థితిగతులు తెలుసుకోవడం, విమాన టికెట్ గురించి ఆరా తీయడం వారిని కదిలించింది.
Similar News
News November 3, 2025
మైక్రో చీటింగ్తో కాపురాల్లో చిచ్చు

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.
News November 3, 2025
సీఏ ఫలితాలు విడుదల

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్సైట్: <
News November 3, 2025
కార్తీక పౌర్ణమి: తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఏం చేస్తారంటే..?

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి, ప్రసాదంగా కొంచెం అన్నాన్ని స్వీకరించడం వలన ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్న భక్తులకిది మంచి అవకాశం.


