News June 7, 2024

నెల్లూరులో మంత్రి పదవి ఎవరికో..?

image

నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి వస్తాయనేది ఉత్కంఠగా మారింది. సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు మంత్రివర్గంలో చోటిస్తే సంతోషిస్తానన్నారు. మరి మీ జిల్లా నుంచి ఎవరు మంత్రి అవుతారనుకుంటున్నారు..?

Similar News

News January 10, 2026

పెంచలకోనలో విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News January 10, 2026

ఆధునిక సాగుతోనే రైతులకు మేలు: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు మెరుగైన లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని ఆయన పరిశీలించారు. పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పద్ధతులను గ్రామంలోని ఇతర రైతులకు కూడా వివరించాలని అధికారులను ఆదేశించారు.

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

image

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్‌లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్‌ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.