News June 7, 2024

రెంజల్: పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

image

రెంజల్ మండలం కల్యాపూర్ శివారులో గురువారం పిడుగుపడి దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోత్ పీర్యానాయక్ (80) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కల్యాపూర్ శివారులో పశువులు మేపడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కింద తల దాచుకోగా చెట్టుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News October 2, 2024

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్

image

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.

News October 2, 2024

బోధన్: రైలు బోగీలో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

బోధన్ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. రైల్వే మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ వెల్లడించారు.

News October 2, 2024

కామారెడ్డి: రూ.10 లక్షలతో పోస్టల్ ఉద్యోగి పరార్

image

రూ.10లక్షల పెన్షన్ డబ్బులతో పోస్టల్ ఉద్యోగి పరారైన ఘటన బీబీపేట్‌లో చోటుచేసుకుంది. తుజాలాపూర్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసే దేవిసోత్ బిక్యానాయక్ పోస్ట్ ఆఫీస్ డబ్బును పక్కదారి పట్టించి గతంలో సస్పెండ్ అయ్యాడు. కాగా గతనెల 30న ఇస్సానగర్, తుజాలాపూర్ గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు SI ప్రభాకర్ వెల్లడించారు.