News June 7, 2024

BREAKING: వడ్డీ రేట్లు యథాతథం

image

రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వడ్డీరేటు 6.5శాతంగా ఉంది. దాన్నే కంటిన్యూ చేస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు ఏడాదిగా వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతోంది.

Similar News

News September 10, 2025

బవుమాకు మళ్లీ అవమానం!

image

SA టీ20 లీగ్‌ వేలంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. 2 లక్షల ర్యాండ్‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో బవుమా అన్‌సోల్డ్‌గా మిగిలారు. గత సీజన్‌లోనూ ఆయన అమ్ముడుపోలేదు. కాగా టీ20 ఫార్మాట్‌లో బవుమా 36 మ్యాచుల్లో 118 స్ట్రైక్ రేట్‌తో 670 పరుగులు చేశారు. గతంలో దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు నాయకత్వం కూడా వహించారు.

News September 10, 2025

అనంతపురం సభకు లోకేశ్ దూరం

image

AP: అనంతపురంలో ఇవాళ జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభకు మంత్రి నారా లోకేశ్ గైర్హాజరు కానున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దీంతో లోకేశ్ వెలగపూడిలోని సచివాలయంలో కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఏపీ వాసులను క్షేమంగా రప్పించేందుకు కేంద్ర మంత్రులు, అధికారులతో సమన్వయం చేయనున్నారు.

News September 10, 2025

పాక్‌తో మ్యాచ్.. నెట్టింట విమర్శలు

image

ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. దాయాదితో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు BCCI ఒప్పుకోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. తాజాగా ‘ఆట మొదలెడదామా’ అని గిల్ చేసిన ట్వీట్‌కు మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై వైరలవుతోంది. ‘మన శత్రువు పాక్‌తో మ్యాచ్ ఆడే రోజు మీ ఆట అయిపోతుంది’ అని రిప్లై ఇచ్చారు. పహల్గామ్ అటాక్ మర్చిపోయారా? అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.